లిఫ్ట్ గుంతలో తాపీ మేస్త్రీ డెడ్​బాడీ

లిఫ్ట్ గుంతలో తాపీ మేస్త్రీ డెడ్​బాడీ

జీడిమెట్ల, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్​మెంట్​లిఫ్టు గుంతలో తాపీమేస్త్రీ శవమై కనిపించాడు. పేట్​బషీరాబాద్​ పోలీసులు తెలిపిన ప్రకారం.. చత్తీస్​ఘడ్​కి చెందిన రమాధి పటేల్(30) జీడిమెట్ల విలేజ్ గ్రీన్​పార్క్ అవెన్యూలో గణేష్​ బిల్డర్స్​నిర్మిస్తున్న అపార్ట్​మెంట్​లో రెండు నెలలుగా మేస్త్రీగా పని చేస్తున్నాడు.   అతడు ఇటీవల సొంతూరికి వెళ్లి గురువారం మధ్యాహ్నం వచ్చాడు. 

ఆ రోజు మద్యం తాగి రాత్రి తన సహచరులతో కలిసి పడుకున్నాడు. శుక్రవారం ఉదయం లిఫ్టు గుంతవద్ద అతడు శవమై కన్పించాడు. మద్యం మత్తులో లిఫ్టుగుంతలో పడి చనిపోయి ఉంటాడని భావిస్తూ..  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  పోలీసులు తెలిపారు.