అర్ధరాత్రి నగల దుకాణంలో చొరబడి 10 కిలోల వెండి దోచుకెళ్లిండ్రు

అర్ధరాత్రి నగల దుకాణంలో చొరబడి 10 కిలోల వెండి దోచుకెళ్లిండ్రు

కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని నగల దుకాణంలో అర్ధరాత్రి  ఎవరూ లేని టైంలో  చోరీ జరిగింది. దుండగులు సీసీ కెమెరాలను పగలగొట్టి షాప్ లో ఉన్న  సుమారు 10 కిలోల వెండి, 30 గ్రాముల గోల్డ్​ను ఎత్తుకెళ్లారు. ఇవాళ పొద్దున్న షాపు  ఓనర్​  గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ లతో ఆధారాలను సేకరించారు. షాపు ఓనర్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ | కలెక్టరేట్‎లో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఈఈ