
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. మొత్తం 21 మందికి ప్రభుత్వం స్థాన కల్పించింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 7) సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్ఫర్ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు ఉన్నారు. అలాగే.. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం బదిలీ అయ్యారు. మిగిలిన 14 మంది ఎస్పీలు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఒకేసారి 21 మంది ఐపీఎస్లను ట్రాన్స్ ఫర్ చేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అధికారుల బదిలీలు, పోస్టింగ్స్:
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూ శర్మ
- నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
- సీఐడీ ఐజీగా ఎం. శ్రీనివాసులు
- నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య
- రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా
- వరంగల్ సీపీగా సన్ప్రీత్ సింగ్
- సీఐడీ ఎస్పీగా సి. రవీందర్
- కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
- ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్
- కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
- భువనగిరి డీసీపీగా ఆక్షాన్స్ యాదవ్
- సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
- సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేశ్ బాబా సాహెబ్
- సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్
- వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
- పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్
- సూర్యాపేట ఎస్పీగా నరసింహ
- మంచిర్యాల డీసీపీగా భాస్కర్
- SIB ఎస్పీగా వై.సాయిశేఖర్
- అడిషనల్ డీజీపీ (పర్సనల్)గా అనిల్కుమార్
- ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా చేతన