సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ సత్తా

సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ సత్తా

హైదరాబాద్: సీఎంఏ ఇంటర్  ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని మాస్టర్  మైండ్స్  అడ్మిన్  అడ్వైజర్  సీఏ మట్టుపల్లి మోహన్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలానికి చెందిన తేజస్విని ఆలిండియా ఫస్ట్  ర్యాంకు, పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన ఎంవీ లక్ష్మీనారాయణ మూడో ర్యాంకు సాధించారని మోహన్  తెలిపారు. 

అలాగే ఇటీవలే విడుదలైన సీఏ ఫైనల్  ఫలితాల్లోనూ తేజస్విని ఆలిండియా 14వ ర్యాంకు, లక్ష్మీనారాయణ 29వ ర్యాంకు సాధించారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను ఆయన అభినందించారు.