
పాట్నా: బిహార్లోని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి వారం రోజులు ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. దీనికి సంబంధించి టీచర్ల ఆన్లైన్ లీవ్స్ పోర్టల్లోని స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్అవుతుండడంతో విద్యాధికారులు స్పందించారు. ఉపాధ్యాయుడు జితేంద్ర కుమార్సింగ్లీవ్ విషయంలో టెక్నికల్ ఎర్రర్ చోటుచేసుకుందని అతనికి ప్రసూతి సెలవు ఇవ్వలేదని వైశాలి జిల్లా మహువా బ్లాక్ ఇన్చార్జ్ విద్యాధికారి అర్చన కుమారి తెలిపారు. ప్రసూతి సెలవులు మహిళా టీచర్లకు మాత్రమే ఇస్తారని.. అయితే పురుష టీచర్లకు పితృత్వ సెలవులు(పెటర్నిటీ లీవ్) తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవహారంలో ఎటువంటి తప్పు జరగలేదని.. పోర్టల్లో సెలవు ఫార్మాట్తప్పుగా నమోదవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. ఈ సాంకేతిక పొరపాటును సరిచేస్తున్నామని తెలిపారు.