మత్తు వదలరా-2 చిత్రం మొదటి రోజు కలెక్షన్లు.
తెలుగులో ఇటీవలే యంగ్ హీరో శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన మత్తు వదలరా-2 చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ రితీష్ రానా దర్శకత్వం వహించగా కమెడియన్ సత్య, సునీల్, వెన్నెల కిషర్, ఫరియా అబ్దుల్లా తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కామెడీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.
కాగా మత్తు వదలరా-2 చిత్రం మొదటి రోజు కలెక్షన్లు చూసినట్లయితే వరల్డ్ వైడ్ గా రూ.5.3 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇందులో యూఎస్ లో 3 లక్షల డాలర్లకి పైగా కలెక్ట్ చేసింది. అంతేగాకుండా గడిచిన 24 గంటల్లో 40వేలకి పైగా టికెట్లు బుక్ అయ్యాయి.
ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టర్స్ ద్వారా తెలిపారు. అయితే మత్తు వదలరా-2 చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ ఉండడం అలాగే శని, ఆదివారాలు సెలవులు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
#MathuVadalara2 begins on a SUPER HIGH note at the Box Office 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) September 14, 2024
Grosses 5.3 CRORES on Day 1 💰
Sensational weekend loading 🔥
Book your tickets now for the HELARIOUS BLOCKBUSTER THRILLER now 💥💥
🎟️ https://t.co/2KCkNRSxXU#BlockbusterMathuvadalara2
A @RiteshRana sequel.… pic.twitter.com/yj1OtSqGsE