ప్టెంబర్ 13వ తారీఖున ప్రముఖ డైరెక్టర్ రితీష్ రానా దర్శకత్వం వహించిన మత్తు వదలరా -2 చిత్రం విడుదలైంది. కాగా ఈ చిత్రంలో యంగ్ హీరో శ్రీ సింహా కోడూరి హీరోగా నటించగా బ్యూటీఫుల్ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఇక వెన్నెల కిషోర్, సత్య, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రం మంచి కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరక్కడంతో ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో మంచి పాజిటివ్ టాక్ తో వియజయవంతంగా ప్రదర్షింపబడుతోంది.
ALSO READ | మత్తు వదలరా -2 చిత్రంపై సినీ ప్రముఖుల ప్రశంసలు.
ఇక ఈ చిత్ర రెండురోజుల కలెక్షన్లు చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ.11 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ వైపు దూసుకుపోతోంది. దీనికితోడు ఈ చిత్రాన్ని చుసిన పలువురు సినీ ప్రముఖులు, డైరెక్టర్లు సైతం సోషల్ మీడియాలో పాజిటివ్ గా స్పందించడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు సెప్టెంబర్ 13న మత్తు వదలరా 2 చిత్రంతోపాటూ విడుదలైన ఇతర చిత్రాలు బాక్సాఫిస్ వద్ద ఢీలా పడ్డాయి. ఒకరకంగా చూస్తే ఈ అంశం కూడా ఈ చిత్రానికి కలసి వచ్చిందని చెప్పవచ్చు.
1 + 1 = 11 ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) September 15, 2024
One Yesu & One Babu take 11 CRORES+ Gross worldwide in 2 days 💥💥💥
Let laughter take over your Sunday ✨
Book your tickets now for the HELARIOUS BLOCKBUSTER THRILLER #MathuVadalara2 now!
🎟️ https://t.co/2KCkNRS08m#BlockbusterMathuvadalara2
A @RiteshRana… pic.twitter.com/AqDpwi4aJE