దసరా హాలిడేస్ స్పెషల్.. సినిమా టికెట్ రేట్లు తగ్గింపు

దసరా హాలిడేస్ స్పెషల్.. సినిమా టికెట్ రేట్లు తగ్గింపు

తెలుగులో ప్రముఖ దర్శకుడు రితీష్ రానా మరియు శ్రీ సింహ కాంబినేషన్ లో తెరకెక్కిన మత్తు వదలరా 2 చిత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రంలోని సత్య కామెడీ మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలకి ప్రేక్షుకులు ఫిదా అయ్యారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు అందించారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా రూ.32.34 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. 

అయితే అక్టోబర్ 2 నుంచి పాఠశాలలకి దసరా హాలిడేస్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి మత్తు వదలరా 2 చిత్ర యూనిట్ టికెట్ రేట్లు తగ్గించింది. ఇందులోభాగంగా టికెట్ ప్రైస్ రూ.112 గా నిర్ణయించి దగ్గరిలో ఉన్న థియేటర్ లో టికెట్ బుక్ చేసుకుని సినిమా ని ఎంజాయ్ చెయ్యాలని చెబుతూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది.

అయితే ఇప్పటికే థియేటర్లలో ఎన్టీఆర్ నటించిన దేవర, శ్రీ విష్ణు స్వాగ్ చిత్రాలు పాజిటివ్ టాక్ తో ప్రదర్శింపబడుతున్నాయి. మరి కలెక్షన్లు రాబట్టడానికి మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

ఈ విషయం ఇలా ఉండగా దర్శకుడు రితీష్ రానా మత్తు వదలరా 2 సీక్వెల్ పై స్పందిస్తూ మత్తు వదలరా 3 ఉంటుందని స్పష్టం చేశాడు. కానీ ఈ చిత్రంకంటే ముందుగా తాను మరో చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు.