హాయిగా నవ్వుకునేలా.. మత్తు వదలరా2

హాయిగా నవ్వుకునేలా.. మత్తు వదలరా2

శ్రీసింహ హీరోగా  రితేష్ రానా రూపొందించిన చిత్రం ‘మత్తు వదలరా2’.   ఫరియా అబ్దుల్లా, సత్య  ముఖ్య పాత్రలు పోషించారు.  మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు.  సెప్టెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌‌‌‌తో రన్ అవుతోందని తెలియజేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి దర్శకులు గోపిచంద్ మలినేని, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, అనుదీప్ హాజరై  అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునే చిత్రమిది అన్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు హార్ట్‌‌‌‌ఫుల్‌‌‌‌గా నవ్వుకోవడం  చాలా ఆనందాన్ని ఇచ్చిందని శ్రీసింహ అన్నాడు. 

 ఈ మూవీ తనకు చాలా స్పెషల్ అని చెప్పాడు సత్య.  సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశామని చెప్పడం హ్యాపీగా అనిపించింది అని దర్శకుడు రితేష్, కాల భైరవ అన్నారు. సినిమా బాగుందని మెసేజ్ పెట్టడంతో పాటు టికెట్లు దొరకట్లేదని మెసేజ్‌‌‌‌లు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని నిర్మాత చెర్రీ అన్నారు.