
హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతోన్న ఘరానా మోసగాడిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్ నగర్కు చెంది చంద్రకాంత్ గౌడ్ (టీంకు భాయ్) MBBS సీట్లు ఇప్పిస్తానని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. రాజకీయ నాయకులు, ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని.. వారి సహయంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూల్ చేశాడు.
కరీంనగర్లోని ఆనంద్ రావు మెడికల్ కాలేజీలో MS(OBG) సీటు ఇప్పిస్తానని ఒకరి దగ్గర కోటి రూపాయిలు తీసుకున్నాడు. సీటు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మంగళవారం (ఏప్రిల్ 29) పోలీసులు చంద్రకాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.