
మెదక్, వెలుగు: ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో వివిధ దేశాల సివిల్ సర్వీస్ అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్రాహుల్రాజ్సోమవారం గెస్ట్ లెక్చర్ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎస్సీజీజీ) ఆధ్వర్యంలో సౌత్ ఈస్ట్ ఆసియా, ఇండియన్ ఓషియన్ రీజీయన్ దేశాల సివిల్ సర్వీసెస్ఆఫీసర్లకు 'స్థానిక పాలనలో సామర్థాల పెంపు' అనే అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ను ఆహ్వానించి గెస్ట్ లెక్చర్ఇప్పించారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక పాలన తీరును విదేశీ సివిల్సర్వీసెస్అధికారులకు వివరించడంతోపాటు, తన అనుభవాలను వారితో పంచుకున్నారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, సందేహాలు నివృత్తి చేశారు. సమర్థవంతమైన స్థానిక పాలనపై సలహాలు, సూచనలు అందించారు. గత సంవత్సరం కూడా రాహుల్రాజ్బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ అధికారులకు ఢిల్లీలో, ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులకు ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో లెక్చర్లు ఇచ్చారు.