
నర్సాపూర్, వెలుగు : రాఖీ పండుగ వేళ ఒక్కగానొక్క అన్నకు రాఖీ కట్టాలని బయలుదేరి వచ్చిన ఆ చెల్లెళ్లకు అన్న తమకు శాశ్వతంగా దూరమయ్యాడని తెలిసి గుండెలవిసేలా ఏడ్చారు. మెదక్ జిల్లా ఆవంచ గ్రామానికి చెందిన కొండి జగన్ (45) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడ్తున్నాడు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతతో చనిపోయాడు.
ఈ విషయం తెలియని చెల్లెళ్లు నరసమ్మ ,అంబిక అన్నకు రాఖీ కడుతామని సంతోషంగా పుట్టింటికి వచ్చారు. కొద్దిసేపటి కిందే అన్న చనిపోయాడని తెలిసి బోరున విలపించారు.