
- రాత్రి వరకు కొనసాగిన ఆందోళన
మెదక్ (చేగుంట), వెలుగు : వీఆర్ఏల రెగ్యులరైజేషన్ జీవో రద్దు చేయాలని మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లికి చెందిన కొండి ప్రదీప్ గురువారం సెల్టవర్ఎక్కి నిరసన తెలిపాడు. వీఆర్ఏల రెగ్యులరైజేషన్ఎవరికీ నచ్చడం లేదని, వాటా బందీ విధానాన్ని ఇదివరకటి లాగానే కొనసాగించాలని డిమాండ్ చేశాడు. జీవో వల్ల ఎంతో మందికి నష్టం జరుగుతుందన్నాడు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో టవర్ఎక్కిన ప్రదీప్ రాత్రి ఏడున్నర గంటల వరకు పైనే ఉన్నాడు.
పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది వచ్చి ఎంత నచ్చజెప్పినా టవర్ దిగేందుకు నిరాకరించాడు. తన డిమాండ్ ముఖ్యమంత్రి కేసీఆర్వరకు చేరాలన్నాడు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ కలెక్టర్ రాజర్షిషా చేగుంటకు వచ్చి తన డిమాండ్లను విని సమస్య పరిష్కరించేంత వరకు టవర్నుంచి కిందకు దిగనని స్పష్టం చేశాడు. చివరకు బతిమిలాడడంతో రాత్రి 8:45 గంటలకు టవర్ దిగాడు.