
మెదక్ (కొల్చారం), వెలుగు: గ్రూప్ 2 ఫలితాల్లో మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లి జడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మనోహర్ రావురాష్ట్రంలో 3వ ర్యాంక్ సాధించాడు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజలం పాడ్ కు చెందిన మనోహర్ రావు 2016లో గ్రూప్ 2 పరీక్ష రాయగా, 2020లో డిప్యూటీ తహసీల్దార్గా పోస్టింగ్ వచ్చింది.
ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో కొంత కాలం విధులు నిర్వర్తించిన ఆయన ఆ ఉద్యోగం వదిలేసి స్కూల్ అసిస్టెంట్ఉద్యోగంలో చేరాడు. 317 జీవోలో ఆయన మెదక్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయి అంసాన్పల్లి జడ్పీ హైస్కూల్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.