
- పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి శూన్యం
- మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్రావు
మెదక్ టౌన్, వెలుగు : గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మెదక్ పట్టణంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని కమీషన్లు ఎక్కువ జరిగిన పనులు తక్కువ అన్నట్టు ఉన్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు విమర్శించారు. మంగళవారం మెదక్ మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రోహిత్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ.. పట్టణంలోని ఆయా కూడళ్లలో వివిధ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశామని ఇదే తరహాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ విషయంలో కొందరు దళిత సంఘాల నాయకులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి గొడవకు దిగడం సరికాదన్నారు. బీజేపీ కౌన్సిలర్ మేఘమాల మాట్లాడుతూ.. బ్రాహ్మణవీధిలో మురికి కాలువలు శిథిలావస్థకు చేరాయని కనీసం నీరు బయటకు పోలేని పరిస్థితి నెలకొందని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్పట్టణంలో నిర్మించిన రైతుబజార్ పూర్తయిందని, కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చినట్లయితే మున్సిపాలిటీకి స్వాధీనం చేస్తారని దీంతో సమస్య తీరుతుందన్నారు. కౌన్సిలర్ భీమరి కిశోర్ మాట్లాడుతూ...
ఔరంగాబాద్, అవుసులపల్లి గ్రామాలను మెదక్ మున్సిపాలిటీలో విలీనం చేశారని ఆ సమయంలో అభివృద్ధి నిధుల కింద కోటి రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అతీగతీ లేవన్నారు. మిషన్ భగీరథ నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పి ఇప్పుడు బిల్లులు వసూలు చేయడం ఏంటని కౌన్సిలర్ మేడి కల్యాణి సభలో ప్రస్తావించారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్ స్పందిస్తూ అప్పటి ప్రభుత్వం సూచనల మేరకు వాటర్ ఛార్జెస్అసెస్మెంట్ జీవో నెంబర్ 180 ప్రకారం పన్నులు వసూలు చేశామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదేళ్లు అధికారంలో ఉన్నపుడు పట్టణ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారా అంటూ ఆయన ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. పదేళ్ల నుంచి గుర్తుకు రాని సమస్యలు తాను ఎమ్మెల్యే అయిన రెండు నెలల కాలంలోనే అదీ మొదటిసారి మున్సిపల్ సమావేశానికి వచ్చిన సమయంలోనే గుర్తుకు వస్తున్నాయా అన్నారు. పదేళ్లపాటు మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని అభివృద్ధి ఎందుకు చేయలేదని కౌన్సిలర్లందరూ మాజీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ధర్నా చేయాలన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని అవసరమైన ప్రత్యేక నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.