
మెదక్, వెలుగు : గవర్నర్ తమిళిసైను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ మాట్లాడుతూ.. డాక్టర్కోర్సు చదివి ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావడం అభినందనీయమన్నారు. మైనంపల్లి సోషల్సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలుసుకుని గవర్నర్ ఎమ్మెల్యే రోహిత్ను అభినందించారు.