ఆత్మకూరు(దామెర), వెలుగు: మేడారం మహా జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ చెప్పారు. మీడియా మిత్రులు, పోలీస్శాఖ సమన్వయంతో జాతరను సక్సెస్చేద్దామని పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట శివారులోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం విలేకర్లు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, పోలీస్అధికారులతో ఎస్పీ కోఆర్డినేషన్మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక పార్కింగ్ సెక్టార్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సెక్టార్ కు ఒక డీఎస్పీ ఇన్చార్జిగా ఉంటారని చెప్పారు.
మొత్తం 34 చోట్ల 1700 ఎకరాల్లో వెహికల్స్పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 14 వేల మంది పోలీసులు, క్రైమ్ కంట్రోల్ కోసం సీసీఎస్ టీమ్నుంచి మరో 500 మంది సిబ్బంది జాతర డ్యూటీలో ఉంటారన్నారు. ట్రాఫిక్నియంత్రణకు సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు గతంలో ఎదుర్కొన్న సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. చిలుకలగుట్ట వద్దకు అనుమతించేందుకు స్పెషల్పాస్లు ఇవ్వాలని కోరగా, ఎస్పీ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ లక్ష్మణ్ కుమార్, నర్సంపేట రూరల్ ఇన్స్పెక్టర్ కిషన్, ఎస్సై కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.