
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. జాతరకు 2024 ఫిబ్రవరి- 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లును నడపనున్నామని తెలిపారు. ఈ రైళ్లు సికింద్రాబాద్ -వరంగల్, నిజామాబాద్ -వరంగల్, సిర్పూర్ కాగజ్నగర్ -వరంగల్ మార్గంలో నడుస్తాయని ఆయన పేర్కొన్నారు.
బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రాంతాల్లోని భక్తులకు.. ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.
ALSO READ : తెలంగాణ తిరుమల.. భక్తుడి కోసం దిగివచ్చిన దేవుడు
కాగా రైళ్లు నంబర్లు ఇలా ఉన్నాయి.
07017/07018: సిర్పూర్ కాగజ్నగర్- వరంగల్- సిర్పూర్ కాగజ్నగర్
07014/07015: సికింద్రాబాద్ వరంగల్ -సికింద్రాబాద్
07019/07020: నిజామాబాద్- వరంగల్- నిజామాబాద్
ప్రధాని మోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన సమాజం సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు కిషన్ రెడ్డి. అందులో భాగంగానే.. సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంతోపాటు.. జాతర ఏర్పాట్ల కోసం రూ. 3 కోట్లను కేటాయించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.