
- పరిధి దాటితే చర్యలు తప్పవని వార్నింగ్
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీల దందాపై ‘వెలుగు’లో వచ్చిన కథనంపై మెడికల్ అండ్హెల్త్అధికారులు స్పందించారు. ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్అనిత శనివారం జిల్లా వైద్యాఆరోగ్యశాఖ ఆఫీస్లో ఆర్ఎంపీ, పీఎంపీలతో మీటింగ్ నిర్వహించారు. రోగులకు ఫస్టెయిడ్ మాత్రమే చేయాలని, పరిధి దాటి వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
వారు ఎలాంటి వైద్యసేవలందించాలనే అంశంపై అవగాహన కల్పించారు. క్లినిక్లకు ‘ప్రథమ చికిత్స కేంద్రం’ అని బోర్డు పెట్టుకోవాలని సూచించారు. పేరుకు ముందు డాక్టర్అని రాసుకోరాదని, వారి వద్ద ఎలాంటి మందులు ఉండరాదని, బెడ్స్ వేసి ట్రీట్మెంట్ చేయరాదని హెచ్చరించారు.
నేషనల్మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ), తెలంగాణ స్టేట్మెడికల్ కౌన్సిల్(టీఎస్ఎంసీ) రూల్స్కు లోబడి ప్రాక్టీస్ చేయాలని సూచించారు. ఎవరైనా రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.