నర్సంపేటలో నేడు వైద్య కళాశాల ప్రారంభోత్సవం

నర్సంపేటలో నేడు వైద్య కళాశాల ప్రారంభోత్సవం

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజ్ ను గురువారం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెల్లడించారు. బుధవారం వరంగల్ కలెక్టర్ సత్యశారదతోకలిసి మెడికల్​కాలేజ్ బిల్డింగ్, జిల్లా ఆస్పత్రి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి హాజరు కానున్నారని ఎమ్మెల్యే తెలిపారు.  వారివెంట కళాశాల ప్రిన్సిపల్​డాక్టర్ మోహన్​దాస్, ఆర్డీవో కృష్ణవేణి, డీసీపీ రవీందర్, డీఎంహెచ్​వో వెంకటరమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తదితరులున్నారు.