108 సిబ్బంది అలర్ట్​గా ఉండాలి : ప్రణయ్ కుమార్

108 సిబ్బంది అలర్ట్​గా ఉండాలి : ప్రణయ్ కుమార్

జూలూరుపాడు, వెలుగు : ఎప్పుడూ 108 సిబ్బంది అలర్ట్​గా  ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమర్జెన్సీ మెడికల్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్​  ప్రణయ్ కుమార్ సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో 108, 102 వాహనం లోని మెడికల్ పరికారాల పనితీరును,ఎ మర్జెన్సీ మందుల కాలపరిమితిని ఆయన తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

మండలంలోని ప్రజలు108 , 102 వాహనాలను అత్యవసర సేవలకు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఈఎంటీ రవి, పైలట్ శ్రీనివాస్​ఉన్నారు.