
తిర్యాణి, వెలుగు: ఓ మహిళకు సిబ్బంది అంబులెన్స్లోనే డెలివరీ చేశారు. తిర్యాణి మండలం రొంపల్లి పంచాయతీలోని రాంజీగుడాకు చెందిన కుర్సెంగ లక్ష్మికి శనివారం పురిటినొప్పులు మొదలయ్యాయి. 108కు సమాచారం అందించగా అంబులెన్స్ అక్కడకు చేరుకొని మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రసవమైంది.
అంబులెన్స్ ఈఎంటీ శ్రీకాంత్, పైలట్ వాసుదేవులు డెలివరీ చేసి తల్లీబిడ్డను కాపాడారు. ఆ తర్వాత బెల్లంపల్లి హాస్పిటల్లో చేర్పించగా తర్వాత పరీక్షించిన డాక్టర్లు వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.