Santhanam: కమెడియన్కు జంటగా స్టార్ హీరోయిన్.. అవసరమా అంటున్న ఫ్యాన్స్

Santhanam: కమెడియన్కు జంటగా స్టార్ హీరోయిన్.. అవసరమా అంటున్న ఫ్యాన్స్

తమిళ ఇండస్ట్రీలో స్టార్ కెమెడియన్ గా కొనసాగుతున్నారు నటుడు సంతానం. తనదైన నటనతో ఆడియన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఈ స్టార్ కమెడియన్. ఆ ఫేమ్ తోనే ఈ మధ్యే హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అలా పలు సినిమాల్లో కూడా నటించాడు. తాజాగా సంతానం హీరోగా దిల్లుకు దుడ్డు-3 అనే సినిమా మొదలుకానుందట. అయితే.. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరిను సెలెక్ట్ చేశారట మేకర్స్. ఈ ప్రాజెక్టుకి మీనాక్షి కూడా ఓకే అందని సమాచారం. 

అయితే.. ఈ న్యూస్ తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కారణం.. ఇపుడిపుడే మీనాక్షికి స్టార్ హీరో సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు.. ప్రస్తుతం ఆమె భారీ ప్రాజెక్టులు కూడా చేస్తోంది. అందులో.. తమిళ స్టార్ విజయ్ తో ది గోట్,వరుణ్ తేజ్ తో మట్కా, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ తో మరో సినిమా చేస్తోంది. ఇలాంటి సమయంలో కమెడియన్ తో సినిమా చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. స్టార్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ మాట విని ఆ సినిమా నుండి మీనాక్షి తప్పుకుంటుందా అనేది చూడాలి.
 
ఇక మీనాక్షి చౌదరి విషయానికి వస్తే.. సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఆమె. ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో వరుస అవకాశాలు దక్కించుకోలేపోయింది. ఆ తరువాత రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమా చేసింది. కానీ, ఆ సినిమా కూడా ప్లాప్ గా నిలిచింది. అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్నారు మీనాక్షి. ఇక చివరగా ఆమె తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించారు.