సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఎంపీల సమావేశం..సెగ్మెంట్ల వారీగా అభివృద్దిపై చర్చ

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఎంపీల సమావేశం..సెగ్మెంట్ల వారీగా అభివృద్దిపై చర్చ

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని రైల్వే నిలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఎంపీలు సమావేశం అయ్యారు. ఎంపీ సెగ్మెంట్లవారీగా రైల్వే అభివృద్ధిపై సమీక్షించారు. 

రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్ల, రైల్వే అండర్ బ్రిడ్జిలు, అండర్ పాసుల సమస్యలను ఎంపీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కావ్య, రఘునందన్ రావులు పాల్గొన్నారు.