మెగాస్టార్ మంచి మనసు.. ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి విరాళం

మెగాస్టార్ మంచి మనసు.. ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి విరాళం

ఆమధ్య అనుకోకుండా భారీ వర్షాకాలకి విజయవాడ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దీంతో వరద భాదితులను ఆదుకునేందుకు  పలువురు ప్రముఖులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించి సహాయం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తనవంతుగా ఒక్కొక్కరూ రూ.50లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. 

దీంతో  బుధవారం (అక్టోబర్ 12) చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబబు నాయుడుని హైదరాబాద్ లో కలిసి రూ.50లక్షల విరాళం చెక్కుని అందించారు. అలాగే ఈ సందర్భంగా రామ్ చరణ్ తేజ్ ప్రకటించిన రూ.50లక్షల విరాళం చెక్కుని కూడా అందజేశారు. దీంతో నారా చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు. విపత్కర సమయంలో సినీ ప్రముఖులు ముందుకొచ్చి సహాయం అందించడం అభినందనీయమని ప్రశంసించారు.

ఈ విషయం ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగులో విశ్వంభర చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  విడుదల కావాల్సి ఉండగా  అనుకోని కారణాలవల్ల సమ్మర్ కి రిలీజ్ వాయిదా పడింది.