Chiranjeevi: ప్రధాని మోదీకి స్పెషల్ థాంక్స్ చెప్పిన చిరు.. ఎందుకంటే.?

Chiranjeevi:  ప్రధాని మోదీకి స్పెషల్ థాంక్స్ చెప్పిన చిరు.. ఎందుకంటే.?
  • ఈ ఏడాది చివరన భారత్ లో సమ్మిట్
  • వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ
  • ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్

టాకీస్: ఈ ఏడాది చివర్లో నిర్వహించనున్న ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌’(వేవ్స్‌) అడ్వయిజరీ బోర్డులో తనకు అవకాశం కల్పించినందుకు చిరంజీవి ప్రధాన మంత్రి మోదీకి థ్యాంక్స్ చెప్పారు.  భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మిట్  నిర్వహించనుంది. ఇందుకోసం సలహాలు సూచనలు కోరేందుకు ప్రధాన మంత్రి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై తాజాగా చిరంజీవి పోస్ట్‌ పెట్టారు. 

మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతోన్న వీడియోను పంచుకున్నారు. అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సమావేశంలో అమితాబ్‌ బచ్చన్‌, మిథున్‌ చక్రవర్తి, రజనీకాంత్‌, చిరంజీవి, నాగార్జున, షారుఖ్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌,  అనిల్‌కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌, హేమామాలినీ, దీపికా పదుకొణె తదితరులు పాల్గొన్నారు. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్రా కూడా  ఈ సమావేశంలో పాల్గొని సమ్మిట్‌పై వారి అభిప్రాయాలు తెలిపారు.

ALSO READ | రామ్ చరణ్ RC16 టైటిల్ అదేనా.. స్టోరీ కూడా మారిందా.?