టీపీసీసీ పదవుల్లో గొల్ల కురుమలకు ప్రాధాన్యత ఇవ్వండి: మేకల రాములు యాదవ్​

టీపీసీసీ పదవుల్లో గొల్ల కురుమలకు ప్రాధాన్యత ఇవ్వండి: మేకల రాములు యాదవ్​

హైదరాబాద్:  రాష్ట్రంలో 18% జనాభా కలిగిన గొల్లకురుమలకు మంత్రి పదవితో పాటు, మూడు ఎమ్మెల్సీలు, ఆరు కార్పోరేషన్​చైర్మన్​ పదవులు ఇవ్వాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్​ డిమాండ్​ చేశారు. ఇవాళ  గాంధీభవన్​లో  టీపీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​ గౌడ్ ఆఫీస్​లో వినతి పత్రాన్ని అందజేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గొల్ల కురుమలకు టీపీసీసీ కూర్పులో సమచిత స్థానం కల్పించాలన్నారు.   అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడానికి  53.4% ఓటు బ్యాంక్​ ఇచ్చి గొల్లకురుమలు కృషి చేశారు.  రాష్ట్రంలో బలమైన కమ్యూనిటీగా మేము  కాంగ్రెస్​కు మా వంతు సహకారాన్ని అందిస్తున్నం.    

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కార్పోరేషన్​ చైర్మన్​లో గొల్లకురుమలకు అవకాశం కల్పించలేదు.  వెంటనే యాదవులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేకల రాములు యాదవ్​ అన్నారు.