
శామీర్ పేట: లోన్ యాప్ వేధింపులతో మరో యువకుడు బలయ్యాడు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ప్రశాంత్ (26) రెండు నెలల నుంచి మేడ్చల్ జిల్లా తూంకుంటలోని హెచ్ పీ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. డబ్బులు అవసరం ఉండి లోన్ యాప్లో లోన్ తీసుకున్నాడు. కొన్నిరోజులుగా లోన్యాప్ నిర్వాహకులు డబ్బులు చెల్లించాలని వేధించడంతో తీసుకున్న దానికంటే అధికంగా నగదు చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా చెల్లించాలని వేధించడంతో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.