
బోధన్, వెలుగు: గణితంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందుతుందని ఎంఈవో నాగయ్య అన్నారు. ఆదివారం బోధన్ పట్టణంలోని విజయసాయి హైస్కూల్ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎంఈవో నాగయ్య మాట్లాడుతూ గణితంతో ఆలోచనశక్తిని పెంచుకోవచ్చన్నారు. అనంతరం గణిత క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో స్యూల్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, మేనేజర్ ఐఆర్ చక్రవర్తి, స్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.