- ఎక్కువ సౌండ్ వస్తున్నదని ప్రజావాణిలో బోయిగూడవాసుల ఫిర్యాదు
- ‘అమెరికన్’ రూల్స్ పాటించామంటూ మెట్రో ఆన్సర్
- కంప్లయింట్ డిస్పోజ్ చేసిన ఆఫీసర్లు
- ‘ఇండియన్’ రూల్స్ ఫాలో కావాలంటున్న బాధితులు
- ప్రజావాణి ఆఫీసర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో ఆఫీసర్లకు, బోయిగూడ జంక్షన్ వద్ద ఎంఎన్కే అపార్ట్మెంట్వాసులకు మధ్య మెట్రో రైళ్ల సౌండ్ పొల్యూషన్ లొల్లి కొనసాగుతూనే ఉంది. బోయిగూడ జంక్షన్ పిల్లర్ బీ –1006 వద్ద రైలు వచ్చినప్పుడు వచ్చే సౌండ్స్తో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, 80 డెసిబుల్స్నమోదవుతుండడంతో మెట్రో అధికారులు ట్రాక్కు గ్రీస్ పూసి చేతులు దులుపుకుంటున్నారని అపార్ట్ మెంట్ వాసులు ఆరోపిస్తూ.. ఎన్నో ఫిర్యాదులు చేశారు. ఈ మధ్యే కలెక్టరేట్ లో ప్రజావాణిలోనూ కంప్లయింట్ చేశారు. అయితే, దీనికి మెట్రో అధికారులు ‘అమెరికన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టు అథారిటీ(ఏపీటీఏ)కి సంబంధించిన సౌండ్ పొల్యూషన్ రూల్స్ను జత చేస్తూ, రూల్స్ కు లోబడే సౌండ్స్ నమోదవుతున్నాయి’ అంటూ వివరణ ఇచ్చారు. దీనికి సంతృప్తి చెందిన అధికారులు ఫిర్యాదును డిస్పోజ్ చేశారు. దీనిపై అపార్ట్మెంట్వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మెట్రోకు ఏపీటీఏ రూల్స్ వర్తించవు
ఏపీటీఏ రూల్స్ మెట్రోకు వర్తించవని, ఇండియన్ రైల్వే మెట్రో ట్రాన్సిట్ సిస్టమ్కు ప్రత్యేకంగా రెకమండేషన్లు చేసిందని, వాటిని మెట్రో అధికారులు ఫాలో కావాలని అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. ప్రజావాణి ఫిర్యాదుకు మెట్రో అధికారులు తప్పుడు వివరణ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం.. రెసిడెన్షియల్ఏరియాల్లో పగలు 55 డెసిబుల్స్, రాత్రి 45 డెసిబుల్స్ కు మాత్రమే పర్మిషన్ ఉంటుంది.
ఏపీటీఏ ప్రకారం హై డెన్సిటీ రెసిడెన్షియల్ఏరియాల్లోని మల్టీ ఫ్యామిలీస్ (అపార్ట్మెంట్లు)ఉండే ఏరియాల్లో 80 డెసిబుల్స్ వరకు అనుమతి ఉంటుంది. దీంతో ఈ నిబంధన అనుకూలంగా ఉండడంతో మెట్రో అధికారులు ప్రజావాణి ఫిర్యాదుకు సమాధానంగా ఇచ్చారని అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. రెకమండేషన్లలో ఇండియన్గవర్నమెంట్ రూల్సే మెట్రోకు వర్తిస్తాయని ఇండియన్ రైల్వే మినిస్ట్రీ స్పష్టంగా చెప్పిందంటున్నారు. కానీ, ప్రజావాణి అధికారులను మెట్రో ఆఫీసర్లు తప్పుడు కాపీ జతపరిచి తప్పు దారి పట్టించారంటున్నారు. దీనిఐ మెట్రో అధికారులను వివరణ అడగగా నిరాకరించారు.
రాత్రిళ్లు 80 డెసిబుల్స్..
సాధారణంగా మెట్రో సర్వీసులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తుంటాయి. కోచ్ల మెయింటనెన్స్ కోసం రాత్రిళ్లు డిపోలకు తీసుకువెళ్లే టైంలో వస్తున్న సౌండ్భరించలేకపోతున్నామని బోయిగూడ ఎమ్ఎన్కే అపార్ట్మెంట్వాసులు అంటున్నారు. గతేడాది మార్చి 6న అర్ధరాత్రి మెట్రో అధికారులు సౌండ్ రికార్డు చేయగా 80 డెసిబుల్స్ నమోదైంది. జీవో 172 కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మెట్రో ట్రాన్సిట్ గైడ్లైన్స్ ప్రకారం రెసిడెన్షియల్ఏరియాల్లో రాత్రి పరిమిత సౌండ్ 45 డెసిబుల్స్ మాత్రమే ఉండాలి. కానీ, మెట్రో రైళ్లు, ట్రాక్ సౌండ్ అధికంగా ఉంది. దీన్ని తగ్గించడానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పలు సూచనలు చేసింది. ఇందులో వీల్ ట్రీట్మెంట్ తో పాటు, మెయింటనెన్స్, సౌండ్ బారియర్స్ఏర్పాటు చేయడం లాంటివి ఉన్నాయి. అయినా మెట్రో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు.