- ఓలా ఫౌండర్ అగర్వాల్ నిర్ణయం
న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫాం అజూర్ నుంచి మొత్తం వర్క్లోడ్ను వచ్చే వారంలోగా కంపెనీ కృత్రిమ్ క్లౌడ్కు తరలించాలని మొబిలిటీ కంపెనీ ఓలా ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ఎంప్లాయ్మెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్ తన పోస్ట్ను తీసివేసినందుకు అగర్వాల్ గురువారం విమర్శలు చేశారు. పోస్ట్తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ లింక్డ్ఇన్ దానిని తొలగించింది. లింక్డ్ఇన్ బాట్లో అగర్వాల్ తన గురించి ఒక ప్రశ్న అడిగారు.
సమాధానం ఇచ్చేటప్పుడు ‘హీ’కి బదులు ‘దే’ (వాళ్లు) అనే ప్రొనౌన్ వాడింది. లింక్డ్న్భాషను ‘ప్రొనౌన్ ఇల్నెస్’గా అగర్వాల్పేర్కొన్నారు. తరువాత వర్క్లోడ్ మార్పు నిర్ణయాన్ని ప్రకటించారు. భారతదేశం తన స్వంత టెక్ ఏఐని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అజూర్ నుంచి బయటకు వెళ్లాలనుకునే ఏ ఇతర డెవలపర్కు అయినా, తాము పూర్తి సంవత్సరానికి ఉచిత క్లౌడ్ సర్వీసును ఇస్తామని ఆఫర్ చేశారు.