వికారాబాద్ జిల్లాలో మూడిండ్లలో చోరీ

వికారాబాద్ జిల్లాలో మూడిండ్లలో చోరీ
  • 12.5 తులాల గోల్డ్, రూ.4.61 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

కొడంగల్, వెలుగు: అర్ధరాత్రి దొంగలు హల్ చల్  చేసిన ఘటన వికారాబాద్​జిల్లాలో జరిగింది. తాళం వేసిన మూడిండ్లలో చొరబడి 12.5 తులాల బంగారం, రూ.4.61 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు, బాధితులు తెలిపిన మేరకు.. బొంరాస్​పేట మండలం ఏర్పుమల్లలో రమేశ్​​తన ఇంటి నిర్మాణానికి బీరువాలో దాచిన రూ. 4 లక్షల డబ్బు,10 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

మరో రెండిండ్లలో  2.5 తులాల గోల్డ్, రూ. 61వేలు దోచుకెళ్లారని బాధితులు నర్సమ్మ, మాసప్ప తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చోరీ జరిగిన ఇండ్లను పరిశీలించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు.