- ఈ నెల 8 వరకు ఫీల్డ్ విజిట్
నిజామాబాద్, వెలుగు: సెంట్రల్ గవర్నమెంట్పరిధిలోని 30 మంది మిలటరీ ఇంజనీర్ల టీం శనివారం జిల్లా స్టడీ కోసం వచ్చారు. తన ఛాంబర్లో వారితో సమావేశమైన అడిషనల్కలెక్టర్ అంకిత్ జిల్లా భౌగోళిక స్వరూపాన్ని వారికి తెలిపారు. 70 నుంచి 80 శాతం మంది ప్రజలు అగ్రికల్చర్ ఆధారంగా జీవనం సాగిస్తున్నారని విలేజ్, మండలం, డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఇక్కడి అధికారులు పనిచేస్తారని వివరించారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు, అలీసాగర్ లిఫ్టు, గోదావరి నది ఆధారంగా వరి, పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న ఎక్కువగా సాగవుతాయన్నారు. 30 మంది మిలటరీ ఇంజినీర్లను ఐదుగురి చొప్పున గ్రూప్గా వేరు చేసి ఒక్కో విలేజ్కు ఫీల్డ్ విజిట్కోసం ఎంపిక చేశారు. ఈ నెల 8 వరకు కొనసాగే వీరి టూర్కు మండల ఆఫీసర్లు సహకరించాలని ఆదేశించారు. డీఆర్డీవో పీడీ సాయాగౌడ్, విజయేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.