మంచిర్యాలలో మార్చి 28 మినీ జాబ్ ​మేళా

మంచిర్యాలలో మార్చి 28 మినీ జాబ్ ​మేళా

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఎంప్లాయ్​మెంట్​ అండ్​ ట్రైనింగ్​ఆఫీసర్​రవికృష్ణ తెలిపారు. అపోలో ఫార్మసీలో 40 ఫార్మాసిస్ట్, 20 ట్రెయినీ ఫార్మాసిస్ట్​, 30 ఫార్మసీ అసిస్టెంట్​, 10 రిటైల్​ ట్రెయినీ అసోసియేట్​ పోస్టులు​ భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. డీఫార్మసీ, బీఫార్మసీ, ఇంటర్​, డిగ్రీ పాసై 18 నుంచి 35 సంవత్సరాల లోపువారు అర్హులన్నారు. సెలెక్టయిన వారికి ట్రైనింగ్​ఇచ్చి మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్ పనిచేసే అవకాశం కల్పిస్తారని చెప్పారు. వివరాలకు 8247656356, 8522903936 నంబర్లను సంప్రదించాలన్నారు.