
కోల్బెల్ట్, వెలుగు: బొగ్గు సంస్థలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు కనీస పెన్షన్ కింద రూ.వెయ్యి చెల్లించేలా సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని బీఎంఎస్ నేషనల్లీడర్, బొగ్గు పరిశ్రమల ఇన్చార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి(సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు మెంబర్), సింగరేణి కోల్మైన్స్కార్మిక సంఘ్ స్టేట్ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య శనివారం తెలిపారు.
పెన్షన్ పై సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించిందన్నారు. 22న ఢిల్లీలో జరిగిన సీఎంపీఎఫ్ట్రస్టీ బోర్డు సభ్యుల180వ బోర్డు మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను శ్రీరాంపూర్లో వారు మీడియాకు వెల్లడించారు. కనీస పెన్షన్అమలు చేస్తామని ట్రస్టీ బోర్డు హామీ ఇచ్చిందని, సీఎంపీఎఫ్లో కొత్త రిక్రూట్మెంట్ ద్వారా సిబ్బందిని పెంచనున్నారని చెప్పారు.