సింగరేణి సర్క్యూలర్​ను దహనం చేసిన మైనింగ్​ స్టాఫ్

సింగరేణి సర్క్యూలర్​ను దహనం చేసిన మైనింగ్​ స్టాఫ్

కోల్​బెల్ట్, వెలుగు: రిటైర్డ్​సర్టిఫికెట్​హోల్డర్లను ఎంవీటీసీ కేంద్రంలో నియమించేందుకు సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్​జారీ చేయడంపై మైనింగ్​ స్టాఫ్ మండిపడ్డారు. నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం మందమర్రి ఏరియా కేకే-5 గనిపై ఆ సర్క్యూలర్​ను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రిటైర్డ్​సర్టిఫికెట్​హోల్డర్లను ఎంవీటీసీలో ట్రైనింగ్​ఆఫీసర్లు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు, ఇన్​స్ట్రక్టర్లుగా నియమించడం సరికాదన్నారు. 

యాజమాన్యం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​చేస్తూ గని మేనేజర్​ భూశంకరయ్యకు వినతిపత్రం అందజేశారు. మైనింగ్​స్టాఫ్​టి.సారయ్య, తిరుపతి, విక్రమ్​సింగ్​, జి.రాజేశ్, విద్యానందన్, తిరుపతి, నాగేశ్వర్​రావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.