![డెడ్ బాడీకి ట్రీట్మెంట్పై మంత్రి సీరియస్ : దామోదర రాజనర్సింహ](https://static.v6velugu.com/uploads/2025/02/minister-damodar-rajanarsimha-orders-probe-into-hospitals-alleged-negligence-in-treating-dead-patient_SqG9CMKxOc.jpg)
- విచారణకు ఆదేశించిన దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: మియాపూర్ మదీనగూడలోని సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రిలో మహిళ మృతదేహానికి రెండు రోజులు వైద్యం చేసిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కాగా, కడప జిల్లాకు చెందిన సుహాసిని(26) కండ్లు తిరిగి పడిపోవడంతో నెల రోజుల క్రితం సిద్దార్థ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు.
అయితే చికిత్స పేరుతో లక్షలు వసూలు చేశారని, ఇంకా డబ్బులుకట్టలేని పరిస్థితి రావడంతో నిమ్స్కు తీసుకెళ్లాలని చెప్పారని మహిళ కుటుంబ సభ్యులు చెప్పారు. నిమ్స్ కు తరలించగా సుహాసిని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. దీంతో శనివారం సుహాసిని ఫ్యామిలీ మెంబర్స్సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. రెండు, మూడు రోజుల క్రితమే చనిపోయినా తమకు సమాచారం ఇవ్వకుండా ట్రీట్మెంట్ పేరుతో డ్రామాలాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.