హైదరాబాద్‌కు మూసీ గుండెకాయ లాంటిది : మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌కు మూసీ గుండెకాయ లాంటిది : మంత్రి దామోదర రాజనర్సింహ

మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మూసీపై బీఆర్ఎస్ నేతలు లేనిపోని హంగామా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ కు గుండెకాయ లాంటి మూసీ నది ప్రక్షాళన రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుంది కాదన్నారు. 2022 లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై ప్రణాళికలు చేసిందన్నారు. ఏన్ని అడ్డంకులు వచ్చినా చెరువులు,నదులను కాపాడుకుంటామన్నారు మంత్రి దామోదర. ఇక 2013 భూ సేకరణ చట్టాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో  పేదల భూములు లాక్కున్నారని విమర్శించారు మంత్రి. 

ALSO READ | అన్ని శాఖల హెచ్ఓడీలతో GHMC నూతన కమిషనర్ మీటింగ్