
జోగిపేట, వెలుగు : టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మంగళవారం ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద జరిగిన బూత్ కమిటీల సమావేశానికి హాజరై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో కలిసి మాట్లాడారు. కాంగ్రెసోళ్లకు ప్రజలు పదకొండు సార్లు అవకాశమిస్తే ఏం డెవలప్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంగారెడ్డిని జిల్లా చేయలేదు, తలాపున ఉన్న సింగూర్ నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థులన్నారు.
ఆందోల్కాంగ్రెస్పెద్ద లీడర్వాళ్లకు, వీళ్లకు టికెట్ఇప్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు భంగపడ్డారని విమర్శించారు. తెలంగాణ సాధించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న కేసీఆర్ను వదులుకుంటే తెలంగాణ ప్రజలు ఆగమవుతారన్నారు. కేసీఆర్ను గెలిపించుకుటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. తల్లి లాంటి బీఆర్ఎస్ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఎంపీ బీబీ పాటిల్మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందాయన్నారు. కార్యకర్తలందరు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మార్క్ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ, మార్క్ఫెడ్ డైరెక్టర్జగన్మోహన్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జైపాల్రెడ్డి, సంజీవయ్య, నారాయణ, వెంకటేశం, శ్రీధర్పాల్గొన్నారు.