
సిద్దిపేట: పొరపాటున కాంగ్రెస్ చేతిలో రాష్ట్రాన్ని పెడితే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టే అని మంత్రి హరీశ్ రావుఅన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులో స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్కు చాన్సిస్తే పెద్దపాము మింగినట్టే. కేసీఆర్ మాట అంటే తప్పడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటడు. బీజేపీ గ్యాస్ ధరను అడ్డగోలుగా పెంచింది. దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నం. ఏ పథకం అయినా మహిళ పేరిట పెడితే సద్వినియోగం అవుతుంది. క్షణికావేశంలో మహిళలు ప్రాణప్రాయ నిర్ణయాలు తీసుకోవద్దని భరోసా, సఖి సెంటర్ లు ఏర్పాటు చేశాం. గతంలో ఎరువుల బస్తా కోసం చెప్పులను క్యూ లైన్ లో పెట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యవసాయ పనులకు కైకిలోళ్లు దొరుక్తలేరనే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం చేరింది’ అని హరీశ్రావు తెలిపారు.
సెల్ఫ్ బీపీ చెకప్ మిషన్ ప్రారంభం
అంతకుముందు సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ లో సెల్ఫ్ బీపీ చెక్ మిషన్ ను మంత్రి ప్రారంభించారు. ఆరోగ్యం కాపాడుకుకోవడం మన చేతుల్లోనే ఉందన్నారు. ప్రజల హెల్త్కాపాడాలనే ఉద్దేశంతోనే బీపీ చెకప్మిషన్ఏర్పాటుచేశామని మంత్రి పేర్కొన్నారు.