
- ఎంపీ ఎన్నికల రిజల్ట్స్ తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ గెలుపు సాంకేతికం మాత్రమేనని విమర్శించారు.
తమ పార్టీ.. ఆ పార్టీ మాదిరిగా తప్పుడు పద్ధతులు, ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 1,437 ఓట్లు పోలైతే.. బీఆర్ఎస్కు 762, కాంగ్రెస్కు 653 వచ్చాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని తెలిపారు.
సెక్రటేరియెట్ మీడియా సెంటర్లో ఆదివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి జూపల్లి మీడియాతో మాట్లాడారు. ప్రజాభిప్రాయం మేరకు కొందరు బీఆర్ఎ స్ వాళ్లు కూడా కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. దీంతో కాంగ్రెస్ కు 300 ఓట్లు అధికంగా వచ్చాయన్నారు. ఎంపీ ఎన్నికల రిజల్ట్స్తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందన్నారు.