మూసీ మురికి నల్గొండ ప్రజలకు శాపం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మూసీ మురికి నల్గొండ ప్రజలకు శాపం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మూసీ వ్యర్థాలతో నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని.. మూసీ మురికి నల్గొండా జిల్లా ప్రజలకు శాపంగా మారిందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. మూసీ పరివాహకప్రాంతం ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందని మంత్రి ఫైర్ అయ్యారు. పెద్ద అంబర్ పేట్, కుంట్లూర్ వాసులు మూసీ వ్యర్థాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం కింద రూ.6వేల కోట్లు ఖర్చు చేసినా నల్గొండా జిల్లాకు ఫ్లోరైడ్ తిప్పల ఇంకా పోలేదని.. మూసీ మురికి, ఫ్లోరైడ్ సమస్యలు నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందిని మంత్రి కోమటి రెడ్డి అన్నారు. గతంలో సీఎం సలహాదారు నర్గీస్ మూసీపై ఓ ఆర్టికల్ రాశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసమే మూసీ ప్రక్షాళన అని వివరించారు.

ALSO READ | బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో కుర్చీల కొట్లాట : మంత్రి తుమ్మల

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరం లేకున్న మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టి, మల్లన్న సాగర్ బాధితులను బీఆర్ఎస్ గవర్నమెంట్ వేధించిందని ఆయన అన్నారు. మల్లన్న సాగర్ రైతులను అక్రమంగా నిర్భందించి కేసులుపెట్టలేదా అని ప్రశ్శించారు. మూసీ కంపు బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని నిలదీశారు. మూసీ కలుషిత నీటితో పండించిన పంటలు తిన్నా అనారోగ్యమే.. ఎంత ఖర్చు అయినా మూసీ నరకం నుంచి తమ జిల్లా ప్రజల్ని బయటపడేయాలి ఆయన కోరారు. నల్గొండ జిల్లా అంటే కేసీఆర్ కక్ష ఉందని చెప్పారు.