ఖమ్మం ఆస్పత్రితో కేసీఆర్​ డ్రామా దీక్ష చేశారు: మంత్రి కోమటిరెడ్డి

ఖమ్మం ఆస్పత్రితో కేసీఆర్​  డ్రామా దీక్ష చేశారు: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ ఉద్యమంలో కొండా బాపూజీ లక్ష్మణ్​ సేవలు మరవలేనివని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. .ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్​  డ్రామా దీక్ష  చేశారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు కేసీఆర్​ కు ఏనాడు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని ఆయన అన్నారు.  కేసీఆర్​ కంటే ముందే చాలా మంది తెలంగాణ కోసం పోరాడారన్న మంత్రి ... రాష్ట్ర ఏర్పాటె ఆవశ్యకత గురించి సోనియాగాంధీకి వివరించామన్నారు. కేసీఆర్​ డ్రామాలతో అమాయక యువత చనిపోయిందన్నారు.   హైదరాబాద్​ తో కూడిన తెలంగాణను ప్రకటించిన  దేవత సోనియాగాంధీ అన్నారు. 

గొర్రెల పంపిణీలో స్కాం జరిగిందని తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పామన్నారు,  దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్​ రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారన్నారు.   మంత్రి పదవి రాలేదని కేసీఆర్​ మళ్లీ ఉద్యమం చేశారన్నారు.