
- త్వరలో ఎథిక్స్ కమిటీ ఏర్పాటు: మంత్రి వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ఎమ్మెల్యేజగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ను ఎత్తివేయబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఆయనపై అనర్హత వేటు వేసే అంశాన్ని పరిశీలించేందుకు త్వరలో ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చిట్ చాట్ చేశారు.
జగదీశ్ రెడ్డి పై 3 మర్డర్ కేసులు ఉన్నాయని, వాటిని తెరిచి జైలుకు పంపిస్తామోననేభయంతో ఇటీవల ఏడ్చారని, అంతే తప్ప రైతుల సమస్యలు, నీళ్ల కోసం కాదని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదు.. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదని అన్నారు. ఈ పదవి కోసం బీఆర్ఎస్లో పోటీ అధికంగా ఉందని చెప్పారు.