
పాత కేసులు గుర్తొచ్చి జగదీశ్ ఏడ్చిండు
మంత్రి కోమటిరెడ్డి చిట్చాట్
హైదరాబాద్: పాత కేసులు గుర్తొచ్చి జగదీశ్ రెడ్డి ఏడ్చిన్నట్లు ఉన్నాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. చిట్చాట్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘హరీశ్ రావు ఎమ్మెల్యే మాత్రమే. డిప్యూటీ లీడర్ కాదు కదా? ఆయన అడిగితే ఎలా మైక్ ఇస్తారు? ప్రతిపక్ష నేత సభలో లేడు. బీఆర్ఎస్ఎల్పీ సెక్రటరీ లేరు. మూడు కేసుల్లో జగదీశ్వర్ రెడ్డిముద్దాయిగా ఉన్నాడు. అవి ఎక్కడ ఓపెన్ చేస్తారో అని ఏడ్చిన్నట్లు ఉన్నాడు’ అని ఎద్దేవా చేశారు.