హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్(ఐఐఐడీ) హైదరాబాద్ రీజనల్ చాప్టర్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఎక్స్పో ఐదో ఎడిషన్ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నందున ఇలాంటి మరిన్ని ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని కోరారు.
బిల్డర్ల కంటే ఆర్కిటెక్ట్స్ పాత్ర చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. డిజైన్ పరిశ్రమలోని సరికొత్త పోకడలను, ఆలోచనలను, ఆవిష్కరణలను హైదరాబాద్కు తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ఐఐడీ-హెచ్ఆర్సీ చైర్పర్సన్ పల్లవి మాట్లాడుతూ ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైన్లు, డిజైన్ నిపుణులు, బిల్డర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, ఎంఈపీ కన్సల్టెంట్లు ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నారని చెప్పారు. మూడు రోజులపాటు ఐఐఐడీ షోకేస్ఇన్సైడర్ ఎక్స్పో కొనసాగుతుందని పేర్కొన్నారు.