నిర్మాణ రంగంలో ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కీలకం : కోమటిరెడ్డి

నిర్మాణ రంగంలో ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కీలకం : కోమటిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇంటీరియర్​ డిజైనర్స్​(ఐఐఐడీ) హైదరాబాద్​ రీజనల్​ చాప్టర్​ హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో ఐదో ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర రోడ్లు  భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నందున ఇలాంటి మరిన్ని ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని కోరారు. 

బిల్డర్ల కంటే ఆర్కిటెక్ట్స్ పాత్ర చాలా ముఖ్యమైనదని  పేర్కొన్నారు. డిజైన్ పరిశ్రమలోని సరికొత్త పోకడలను, ఆలోచనలను,  ఆవిష్కరణలను హైదరాబాద్​కు తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ఐఐడీ-హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ  చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పల్లవి  మాట్లాడుతూ ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇంటీరియర్ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డిజైన్ నిపుణులు, బిల్డర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, ఎంఈపీ కన్సల్టెంట్లు ఈ ఎక్స్​పోలో పాల్గొంటున్నారని చెప్పారు. మూడు రోజులపాటు ఐఐఐడీ షోకేస్​ఇన్​సైడర్​ ఎక్స్​పో కొనసాగుతుందని పేర్కొన్నారు.