సర్వే చేయాలంటే ముందు కేటీఆర్ దరఖాస్తు చేసుకోవాలి: మంత్రి కొండా సురేఖ

సర్వే చేయాలంటే ముందు కేటీఆర్ దరఖాస్తు చేసుకోవాలి: మంత్రి కొండా సురేఖ

సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే చేయాలని కేటీఆర్ అంటున్నారని, కానీ సర్వే చేయాలంటే ముందు కేటీఆర్ దరఖాస్తు చేసుకోవాలి కదా అని ప్రశ్నించారు. రీ సర్వే అంటున్న కేటీఆర్.. తన చెల్లి కవితను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. సర్వే, ప్రొఫార్మా లో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. అయినా అసంతృప్తి అనేది తనకు తెలియదని, ఈ విషయంలో తాను ఎవరినీ ఎంకరేజ్ చేయడంలేదని అన్నారు. దేవాదాయ శాఖ లో ఉద్యోగుల కొరత ఉందని, అడ్మినిస్ట్రేషన్ కు ఇబ్బంది అవుతున్నందు వల్ల రెవెన్యూ ఉద్యోగులను తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదని అన్నారు.

ALSO READ | ప్రామిస్ డే రోజున సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కీలక సూచన

లీగల్ లిటిగేషన్స్ లేని దేవాదాయ శాఖ భూములను  మొదటి దశలో సర్వే చేయాలని అదేశించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంబాభిషేకాలు చేయాలో లిస్ట్ తియ్యాలని ఆదేశాలు ఇచ్చామని.. కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుందని గుర్తు చేశారు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో సర్వేయర్ల ప్రొటెక్షన్ పై ఎలాంటి ఫిర్యాదులు లేవని, గత పదేళ్ళలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయని తెలిపారు. 

బీజేపీ నేత ఈటెల రాజేందర్ పై త్వరలోనే విచారణ జరుగుతుందని మంత్రి అన్నారు. బీసీ సర్వే తో ప్రభుత్వానికి పేరు వస్తుందనే BRS నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విలువ ఇప్పుడే అర్థం కాదని.. అమలు చేశాక తెలుస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు, ఇతర అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.