
గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెండు హౌజింగ్ సొసైటీల్లో లేని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. యూనియన్ల నేతలు శుక్రవారం కేటీఆర్ను కలిశారు. సొసైటీల్లో లేని వారి కోసం హసన్పర్తి మండలం మడిపల్లిలో కేటాయించిన 13 ఎకరాల స్థలానికి సంబంధించిన సర్క్యులర్ కాపీని సిక్స్మెన్ కమిటీ సభ్యులకు అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో ప్రెస్క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, సిక్స్మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్, కో కన్వీనర్ బొక్క దయాసాగర్, సభ్యులు గడ్డం రాజిరెడ్డి, మస్కపురి సుధాకర్ ఉన్నారు.