
ఈ నెల 21న జరగనున్న భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ తెలిపారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ మూవీ... కోవిడ్, ఏపీలో టికెట్ల గొడవ వల్ల వాయిదాపడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ నెల 25న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు భీమ్లా నాయక్ దర్శక నిర్మాతలు తెలిపారు. సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు అనగా ఈ నెల 21న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. సాగర్ చంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మలయాళం హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’రీమేక్గా తెరకెక్కిన భీమ్లా నాయక్ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#BheemlaNayak Pre-Release event will be held on 21st Feb!?
— Sithara Entertainments (@SitharaEnts) February 19, 2022
Young & dynamic leader Shri. @KTRTRS garu will grace the event? #BheemlaNayakOn25thFeb @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @vamsi84 @NavinNooli pic.twitter.com/AfqHKEJDa9