
పటాన్చెరు, వెలుగు : హైదరాబాద్ కోకాపేటలో నిర్మించిన 15ఎంఎల్డీ కెపాసిటీ ఎస్టీపీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు మరోసారి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంత్రి కేటీఆర్ విదేశాల్లో సైతం తిరుగుతూ స్వరాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చెందేలా చూస్తున్నారని తెలిపారు.
స్టూడెంట్స్కోసం ఆటోలు
గుమ్మడిదల మండలం మంబాపూర్ నుంచి గుమ్మడిదల వరకు స్కూల్ స్టూడెంట్స్ రవాణా సౌకర్యం కోసం రెండు ఆటోలను ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వాటిని శనివారం ప్రారంభించారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం ఎన్ఎంఆర్యుసేనా దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీలం మధు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ దయానంద్, గుమ్మడిదల మండల ఎన్ఎంఆర్ యువసేన నాయకులు గ్యారల మల్లేశ్, తుజాల్ పూర్ వీరేశ్, జింక గోపాల్, విష్ణు, ముత్యాలు, అశోక్, దేవునిచెరువు నర్సింలు, నల్లవల్లి సురేశ్, దోమడుగు నాగరాజు, శంకర్, ప్రకాశ్, విజయ్, నర్సింలు, శ్రీకాంత్, ప్రశాంత్, నాగరాజు, అరుణ్, గ్రామ పెద్దలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.